న్యూఢిల్లీ : టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు పార్లమెంట్ లైబ్రరీని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ ప్రతిని, ఇతర పుస్తకాలను ఎంపీలు పరిశీలించారు. పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్, టీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వర్ రావు.. గ్రంథాలయ హాల్లోని పుస్తకాల విశిష్టతను వివరించారు. లైబ్రరీ సందర్శనలో రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు, బండి పార్థసారథి రెడ్డి, లోక్సభ ఎంపీ పోతుగంటి రాములు ఉన్నారు.