హైదరాబాద్ : టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జే సంతోష్ కుమార్ తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. ఉప్పల్ భగాయత్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. మొక్కలు నాటిన తర్వాత సంతోష్ కుమార్ కేక్ కట్ చేశారు. సంతోష్ కుమార్కు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆర్గనైజర్ రాఘవ,
బన్నాల గీత ప్రవీణ్ కుమార్ ముదిరాజ్(చిలకా నగర్ 7వ డివిజన్ కార్పొరేటర్), ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు వేముల సంతోష్ రెడ్డి, యువ డైరెక్టర్ పూర్ణ, వివిధ డివిజన్ స్థాయి అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మహిళా సంఘాల నాయకులు, ఉప్పల సాయి కిరణ్, ఉప్పల సాయితేజ పాల్గొన్నారు.