హుజూరాబాద్ : బడుగు, బలహీన వర్గాలకు అందిస్తున్న ఆసరా పెన్షన్లను అవహేళన చేస్తూ, పరిగెతో పోల్చిన నాయకులకు త్వరలో జరగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి లబ్దిదారులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి లబ్దిదారులకు పిలుపునిచ్చారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో నూతనంగా 466 మందికి ఆసరా పెన్షన్లు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో లబ్దిదారుల నివాసాల వద్దకు వెళ్లి పెన్షన్ మంజూరు పత్రాలను ఎమ్మెల్సీ పల్లా అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా మాట్లాడుతూ.. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, ఒంటరి మహిళా, కళ్ళుగీత, చేనేత, బీడీ కార్మికులకు పెన్షన్లు మంజూరు అయ్యాయని తెలిపారు. మంజూరు పత్రాలను లబ్దిదారులకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా తెలిపారు.