మహబూబ్నగర్ : జడ్చర్ల మండలం బండమీదిపల్లి శివారులో రూ.1.25 కోట్లతో నిర్మించిన 24 కొత్త డబుల్ బెడ్రూం ఇండ్లను టీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. బండమీదిపల్లి గ్రామంలో ఇండ్లను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇండ్లు రాని వారు నిరాశ చెందొద్దని సూచించారు. అర్హులైన వారందరికీ త్వరలోనే మరిన్ని డబుల్ బెడ్రూం ఇండ్లును మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇండ్లు లేని పేద కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టిస్తామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.