హైదరాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ది వ్యాపార నైజం.. ఆయనకు ఏ సిద్ధాంతం లేదని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. కమ్యూనిస్ట్ కమ్యునలిస్ట్గా మారారని విమర్శించారు. గజ దొంగల పార్టీలో చేరిన ఈటెల నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, వివేకానంద, ముఠా గోపాల్తో కలిసి గువ్వల బాలరాజు టీఆర్ఎస్ ఎల్పీలో మీడియాతో మాట్లాడారు.
అనామకుడైన ఈటెలను సీఎం కేసీఆర్ మంత్రిని చేశారని బాలరాజు గుర్తు చేశారు. ఈటెలకు బీజేపీలో ఏం ప్రత్యేకత ఉందని ఆయనతో ఇతర పార్టీల వారు టచ్లో ఉంటారని ప్రశ్నించారు. రాజేందర్కు దమ్ముంటే.. ఆయనతో టచ్లో ఉన్నవారి పేర్లను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ తెలంగాణలో ఎదగడానికి అవకాశం లేదన్నారు. తెలంగాణలో బీజేపీ సింగిల్ డిజిట్ కూడా దాటదని స్పష్టం చేశారు. తెలంగాణ లో ప్రభుత్వాన్ని పడగొట్టడం మోదీ జేజమ్మ తరం కూడా కాదని బాలరాజు తేల్చిచెప్పారు.