న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీల భేటీ ముగిసింది. సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ధాన్యం సేకరణపై చర్చించారు. ధాన్యం సేకరణపై లిఖితపూర్వక హామీకి మంత్రులు, ఎంపీలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని లిఖితపూర్వకంగానే ఇవ్వాలని మంత్రులు పట్టుబట్టారు. ఈ ప్రతిపాదనపై స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. రెండు రోజుల్లో స్పష్టత ఇస్తామని చెప్పారు.
రైతుల విషయంలో రాజీలేని పోరాటం చేస్తామని ఎంపీలు, మంత్రులు తేల్చిచెప్పారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు. మూడు రోజుల క్రితం తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లగా.. పీయూష్ గోయల్ మంగళవారం అపాయింట్మెంట్ ఇచ్చారు.