మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్ 9: ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగిందని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ను ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, కలెక్టర్ వెంకట్రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. డయాగ్నస్టిక్ సెంటర్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి కార్పొరేట్స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కేంద్రంలో గంటకు 1,200 పరీక్షలు అవుతాయని, 57 రకాల పరీక్షలు ఉచితంగా చేయించుకోవచ్చని తెలిపారు.