హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికారుల అనుమతితో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగులను చించిన బీజేపీ కార్యకర్తలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నాయకులు సీపీ స్టీఫెన్ రవీంద్రను కోరారు. ఈ మేరకు ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్ రాజు, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు ఎం శ్రీనివాస్రెడ్డి, భరత్కుమార్ సీపీ స్టీఫెన్ రవీంద్రను శుక్రవారం ఆయన కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు.