రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 34 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో విండీస్ స్టార్ హిట్టర్ క్రిస్ గేల్(46: 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. గతంలో గేల్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.
బెంగళూరు స్పిన్నర్ యుజువేంద్ర చాహల్తో కలిసి యూనివర్స్ బాస్ మైదానంలో సందడి చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత గేల్, చాహల్ తమ జెర్సీలు విప్పేసి హంగామా చేశారు. గేల్ తన కండలను చూపిస్తూ ఫోజు కొడితే, ఆ పక్కనే ఉన్న చాహల్ మాత్రం తన కండలను సిగ్గు పడుతూ చూపిస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. వీరిద్దరూ కండలు చూపిస్తుండగా మరో బెంగళూరు ఆటగాడు ఫొటోలు తీశాడు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని బెంగళూరు ఈసారి స్ఫూర్తిదాయక ప్రదర్శనతో దూసుకెళ్తోంది.