హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు సహా 283 మంది కీలక ప్రతినిధులు భేటీకి హాజరయ్యారు. అలాగే సమావేశానికి పలు రాష్ట్రాల నేతలు సైతం హాజరయ్యారు. కర్నాటక మాజీ ముఖ్యమంతి, జేడీఎస్ నేత హెడీ కుమారస్వామి, ఆయన పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధినేత తిరుమావళన్తో పాటు ఎంపీలు భేటీకి హాజరయ్యారు.
ప్రస్తుతం జాతీయ పార్టీగా ఎందుకు మారుస్తున్నామో సభ్యులకు కేసీఆర్ వివరిస్తున్నారు. అనంతరం టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. తీర్మానానికి ఆమోదం తెలుపుతూ 283 మంది సభ్యులు ఆమోదముద్ర వేయనున్నారు. ఆ తర్వాత సంతకాలు సేకరించనున్నారు. తీర్మానం అనంతరం 1.19 గంటలకు కేసీఆర్ జాతీయ పార్టీపై కీలక ప్రకటన చేయనున్నారు. ఇదిలా ఉండగా.. అంతకు ముందు ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్న కేసీఆర్కు నేతలు, గులాబీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. దేశ్కీ నేత కేసీఆర్ నినాదంతో హోరెత్తించారు.