పెద్దవూర/మాడ్గులపల్లి/హాలియా, మార్చి 27: నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ ప్రచారం జోరు గా సాగుతున్నది. ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. పెద్దవూరలో శనివారం ఏర్పాటుచేసిన ఆర్ఎంపీలు, ప్రైవేటు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో, పోతునూరులో ఎన్నికల ప్రచారంలో విప్ బాల్క సుమన్ పాల్గొన్నారు. హాలియాలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గడపగడపకూ గులాబీ దండు కార్యక్రమం నిర్వహించారు. తిరుమలగిరి మండలం రంగుండ్లలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, త్రిపురారం మండలంలో ఎమ్మెల్యే శంకర్నాయక్, నిడమనూరు మండలంలో ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, అరూరి రమేశ్ ప్రచారం నిర్వహించారు. నందికొండ మున్సిపాలిటీలోని పైలాన్, హిల్కాలనీల్లో కరీంనగర్ మేయర్ సునీల్రావు, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ రామకృష్ణ ప్రచారంచేశారు. మాడ్గులపల్లి మండలం గోపాలపురంలో ఎమ్మెల్యే జీవన్రెడ్డి గడపగడపకు ప్రచారం నిర్వహించారు.
టీఆర్ఎస్లో పలువురి చేరిక
మాడ్గులపల్లి మండలం మాచనపల్లి సర్పంచ్ జూలకంటి పద్మ, పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నుంచి గ్యారకుంటపాలెంలో ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. తిరుమలగిరి సాగర్ మండలం రంగుండ్లలో వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సమక్షంలో, త్రిపురారం మండలం కొణతాలపల్లిలో కాంగ్రెస్ నుంచి 25 కుటుంబాల వారు ఎమ్మెల్యే శంకర్నాయక్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు.
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం మద్దతు
సాగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి కృషిచేస్తామని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల రాష్ట్ర అధ్యక్షుడు చింత కృపాకర్ ప్రకటించారు. అనుముల మండలం హాలియాలో శనివారం ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నాయకులతో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు సమావేశమయ్యారు. వారి సమస్యలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు వివరించి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా చింత కృపాకర్ మాట్లాడుతూ.. తమ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి సాగర్ ఉపఎన్నికలో 400 మందితో నామినేషన్లు వేయాలనుకున్నామన్నారు. సీఎం కేసీఆర్తోనే తమకు న్యాయం జరుగుతుందని నమ్మి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు తెలిపారు.