హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ వెంటనే ఆమోదించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో తీర్మానించారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ ప్రవేశపెట్టారు.
2010లో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపితే ఇంత వరకు లోక్సభలో ఆమోదం పొందలేదని గుర్తుచేశారు. మార్కెట్ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. బీజేపీకి కేంద్రంలో సంపూర్ణమైన మెజార్టీ ఉన్నప్పటికీ బిల్లును ఎందుకు ఆమోదించడంలేదని నిలదీశారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ఈ తీర్మానాన్ని బలపర్చారు. సమాజంలో సభ భాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేదని చెప్పారు.