హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలకు సంబంధించి త్రిసభ్య కమిటీ సమావేశం ఈ నెల 25న జరుగనున్నది. ఇంతకు ముందు కమిటీ ఒకసారి సమావేశం కాగా.. తాజాగా జరిగే భేటీ రెండోది. కేంద్ర హోంవాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో వర్చువల్ విధానంలో భేటీ జరుగనున్నది. సమావేశానికి తెలంగాణ తరఫున ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ పాల్గొనున్నారు.
తెలంగాణ, ఏపీ మధ్య విభజన అంశాలు, సమస్యలపై సమీక్షించనున్నారు. అలాగే ఢిల్లీలోని ఏపీ భవన్, విభజనచట్టం తొమ్మిదో షెడ్యూల్లోని సంస్థల విభజనపై చర్చించనున్నారు. సింగరేణితో పాటు అనుబంధ సంస్థ ఆప్మెల్ విభజనతో పాటు చట్టంలో పేర్కొనని సంస్థల విభజనపై చర్చ జరిగే అవకాశం ఉన్నది.