హైదరాబాద్ : ఆగస్టు 8వ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజనుల జీవన వైవిధ్యాన్ని తెలిపే ప్రదర్శన ప్రారంభమైంద. నగరంలోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో నాలుగు రోజుల పాటు (05వ తేదీ నుంచి 08వ తేదీ వరకు) కొనసాగే ఈ ప్రదర్శనను రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం ప్రారంభించారు. గిరిజన చేతివృత్తులు, చిత్రలేఖనం, వారి జీవన వైవిద్యం తెలిపేలా ప్రదర్శన కొలువు తీరింది. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, సంయుక్త సంచాలకులు సముజ్వల, గిరిజన మ్యూజియం క్యూరేటర్ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.