శంషాబాద్ రూరల్, మే 25 : మలద్వారంలో దాచుకొని అక్రమం గా తరలిస్తున్న బంగారాన్ని ఎయిర్ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అధికారులు గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు. గురువారం ఉదయం మస్కట్ విమానం దిగిన ఒక ప్రయాణికుడిని అనుమా నంతో అధికారులు తనిఖీలు చేశారు.
మలద్వారంలో పేస్టురూపంలో దాచుకొని తరలిస్తున్న 685.7 గ్రా ముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ. 42,78,768 ఉం టుందని తెలిపారు. నిందితుడు మధ్యప్రదేశ్ వాసి. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.