నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 29: సాగునీటి రంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు జేకే కాలనీ సింగరేణి గ్రౌండ్లో ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అధ్యక్షతన సోమవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న సింగరేణిని లాభాల బాటలోకి తెచ్చింది కేసీఆరేనని స్పష్టం చేశారు.
సంక్షేమ, అభివృద్ధి పథకాల రూపంలో ప్రతి ఇంట్లో సీఎం కేసీఆర్ ఉన్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి, దర్దేపల్లి, టీఎస్కే తండా, కొండాపురం, పెద్దతండా( కే)లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. రాష్ట్రంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల నిర్మాణంతో పంటలు బాగా పండుతుండటంతో సీఎం కేసీఆర్ పాలనలో రైతులు రాజుగా మారుతున్నారని తెలిపారు.
జులాయిగా తిరిగిన వారే ప్రతిపక్ష పార్టీల్లో రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం పస్నూర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఇష్టంలేని రేవంత్రెడ్డి చంద్రబాబుకు కాపలా కుక్కలా ఉండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఏర్పడిన పదేండ్లలోనే అభివృద్ధిలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అ న్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం చాగల్లులో నిర్వహించిన సమ్మేళనంలో ఆయన మా ట్లాడారు. సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా, ప్రజల కష్టాలు పోయి బంగారు భవిష్యత్తు రావాలంటే ఒక్క కేసీఆర్తోనే సాధ్యమని గుర్తించి రెండు సార్లు కేసీఆర్ను ప్రజలు ముఖ్యమంత్రిని చేశారన్నారు. సమ్మేళనంలో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ లు బస్వరాజు సారయ్య, కోటిరెడ్డి పాల్గొన్నారు. కాగా నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో నిర్వహించిన సమ్మేళనంలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు.