హనుమకొండ, నవంబర్ 24: ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకు రిజర్వేషన్ కల్పించాలని ట్రాన్స్జెండర్లు విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన ట్రాన్స్జెండర్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాసర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షల్లో ట్రాన్స్జెండర్లు అర్హత సాధించిన విషయాన్ని దాస్యం దృష్టికి తీసుకొచ్చారు.
ఉద్యోగాల భర్తీలో తమకు ప్రత్యేక కోటా కేటాయించాలని, తమకు అనుమతి లేని పోలీసు శాఖలో తమను భర్తీకి అనుమతిచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమాజంలో అనేక అవమానాలు, చీతారాలు ఎదురొంటున్న ట్రాన్స్జెండర్ల జీవితం ఉమ్మడి ఏపీలో అత్యంత దుర్భరంగా ఉండేదని, తెలంగాణ ఏర్పడ్డాక వారికి అనేక వేదికల్లో జీవనోపాధి కల్పించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 52 వేల మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్టు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తేలిందని, వారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరుతానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, పోలీసు ఉద్యోగాల భర్తీలో అనుమతిపై ట్రాన్స్ జెండర్ల విజ్ఞప్తిని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.