హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : లోక్సభ ఎన్నికల నేపథ్యం లో తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ బదిలీల్లో 9 మంది ప్రొహిబిషన్ ఎఅండ్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్లు, 14 మంది సూపరింటెండెంట్లు ఉన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు.