హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లు, ఇద్దరు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. వెయిటింగ్లో ఉన్న డిప్యూటీ కలెక్టర్లు అనిల్ కుమార్, బీ సంతోషి, ఆర్ఎస్ చంద్రావతి, కే వెంకట ఉపేందర్రెడ్డికి పోస్టింగ్లు ఇచ్చింది. వ్యవసాయ శాఖలో డిప్యూటేషన్లో ఉన్న డిప్యూటీ కలెక్టర్ పీ రామచందర్ను నారాయణపేట ఆర్డీవోగా నియమించింది. నారాయణపేట ఆర్డీవో వెంకటేశ్వర్లును వెయిటింగ్లో ఉంచింది. అదనపు కలెక్టర్లుగా పనిచేస్తున్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు యూ రఘురామ్శర్మ (జోగుళాంబ గద్వాల)ను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు, పీ చంద్రయ్య (వికారాబాద్)ను పురపాలక శాఖకు బదిలీ చేసింది.
నాన్క్యాడర్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల (ఎస్జీడీసీ)కు పోస్టింగ్లు ఇచ్చిన ప్రభుత్వం ఇద్దరిని బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. వెయిటింగ్లో ఉన్న ఆరుగురు ఎస్జీడీసీలకు అడిషనల్ కలెక్టర్లుగా పోస్టింగ్లు ఇస్తూ, మరో ఇద్దరిని బదిలీ చేస్తూ సీఎస్ ఆదేశాలు జారీచేశారు. వెయిటింగ్లో ఉన్న బీఎస్ లతను జగిత్యాల అదనపు కలెక్టర్గా, జీ పద్మజారాణిని నారాయణపేట అదనపు కలెక్టర్గా, రాజన్న-సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్గా ఖీమ్యానాయక్, ములుగు అదనపు కలెక్టర్గా వైవీ గణేశ్, వరంగల్ రూరల్ జిల్లా అదనపు కలెక్టర్గా కే శ్రీవాత్సవ, మహబూబాబాద్ అదనపు కలెక్టర్గా ఎం డేవిడ్లను నియమించారు. ప్రస్తుతం నాగర్కర్నూల్ అదనపు కలెక్టర్గా ఉన్న పీ శ్రీనివాస్రెడ్డిని సిద్దిపేట అదనపు కలెక్టర్గా, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పాలనాధికారిగా ఉన్న కే చంద్రమోహన్ను కామారెడ్డి అదనపు కలెక్టర్గా బదిలీ చేశారు.