హైదరాబాద్: నాంపల్లి రైల్వేస్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చిన రైలు ఆగేందుకు నెమ్మదిగా నాంపల్లి స్టేషన్లో ఆగే క్రమంలో డెడ్ ఎండ్ గోడను ఢీకొట్టింది. దాంతో రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పి పక్కకు వెళ్లాయి. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాదంలో గాయపడిన వారిని రైల్వే అధికారులు చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. స్టేషన్లో దిగడానికి కొన్ని సెకన్ల ముందు రైలు ప్రమాదానికి గురవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు స్టేషన్లో ఆగే క్రమంలో నెమ్మదిగా ఉంది కాబట్టి సరిపోయిందని, లేదంటే పెను ప్రమాదం జరిగేదని చర్చించుకుంటున్నారు.
కాగా ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. రైలు ఆగుతున్న సమయంలో పట్టాలు దిగినందున పెను ప్రమాదం తప్పిందని పేర్కొంది. అప్పటికే చాలామంది ప్రయాణికులు దిగిపోయారని, కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపింది. రైలులోని ఎస్ 2, ఎస్ 3, ఎస్ 6 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయని వెల్లడించింది.
Charminar Express from #Chennai to Hyderabad derailed at #Nampally railway station.
Minor injuries reported among some passengers.#Hyderabad #Derailment #Charminarexpress pic.twitter.com/ggnItYXTU2
— Sudhakar Udumula (@sudhakarudumula) January 10, 2024