సిద్దిపేట : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో విషాదం చోటు చేసుకుంది. కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నీ(Cricket tournamen)లో క్రికెట్ ఆడుతుండగా బౌలింగ్ వేస్తున్న క్రమంలో హార్ట్ స్ట్రోక్(Heart attack)తో శనిగరం ఆంజనేయులు (37) అనే యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
స్థానిక యువకులు గుండెపోటుగా అనుమానంతో సీపీఆర్(CPR) నిర్వహించినా ఫలితం లేకపోవడంతో హుటాహుటినా హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి(Hospital)కి తరలించారు. అక్కడి వైద్య సిబ్బంది అతడికి మరోసారి సీపీఆర్ చేసినా ప్రయోజనం దక్కలేదు. దీంతో ఆ యువకుడు అప్పటికే మృతి చెందాడని వైద్యులు(Doctors) నిర్ధారించారు.
మృతుడు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు స్నేహితులు, క్రీడాకారుల్లో విషాదం నెలకొని ఉంది.