సంగారెడ్డి : విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గుండెపోటు(Heart attack) తో మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా(Sangareddy)లో చోటుచేసుకుంది. జిల్లాలోని చౌటకూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలి(Government Teacher)గా పనిచేస్తున్న పద్మలత బుధవారం తరగతి గది నుంచి బయటకు వచ్చి నీళ్లు తాగి కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను సహచర ఉపాధ్యాయులు 108 అంబులెన్స్లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. సంగారెడ్డి స్వస్థలమైన ఆమె మృతిపట్ల ఉపాధ్యాయులు, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు.