రంగారెడ్డి: కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురైన తల్లి ఆత్మహత్య (Suicide)చేసుకున్న ఘటన రంగారెడ్డి(Rangareddy)లో చోటు చేసుకుంది. షాబాద్ మండలంలోని హైతాబాద్ గ్రామంలో జరిగిన ఘటనతో గ్రామంలో విషాదం(Tragedy) నెలకొంది. గ్రామంలోని మల్లేశ్, యాదమ్మ దంపతులకు సుమిత్ర అలియాస్ శిరీష అనే కూతురు, కొడుకు గురుప్రసాద్ ఉన్నారు.
సుమిత్రకు రెండున్నర సంవత్సరాల క్రితం రుద్రారం గ్రామానికి చెందిన శివకుమార్ అనే యువకుడితో వివాహం(Marriage) జరిగింది. వీరిద్దరి మధ్య మనస్పర్ధాలు రావడంతో భర్త శివ కుమార్ కొన్ని రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో సుమిత్ర మంగళవారం రాత్రి ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు మరణాన్ని తట్టుకోలేక తల్లి యాదమ్మ మనస్తాపానికి గురై బుధవారం ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో దూకి ఆత్మ హత్య చేసుకుంది.
పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు షాబాద్ సీఐ గురువయ్య గౌడ్ తెలిపారు.