రామారెడ్డి, సెప్టెంబర్ 27: డీజే సౌండ్కు ఓ యువకుడి గుండె ఆగింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటలో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన నరేశ్ (35) స్థానిక యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్నాడు.
ఉత్సాహంగా యాత్ర సాగుతుండగా డీజే సౌండ్కు నరేశ్ గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు, బంధువులు వెంటనే కామారెడ్డి దవాఖానకు తరలించగా అప్పటికే మరణించాడు.