మహబూబాబాద్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాలేరు వాగులో పడి ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద ముప్పారం పాలేరు వాగులో ప్రచండ(16) అనే విద్యార్థి గల్లంతయ్యాడు. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నిన్న స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ప్రచండ… ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయాడు. ప్రచండ తల్లిదండ్రులు తమ కొడుకు ఎక్కడని ప్రచండ స్నేహితులను నిలదీయటంతో గల్లంతైన విషయాన్ని స్నేహితులు బయటపెట్టారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో ప్రచండ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.