చౌటుప్పల్, ఆగస్టు 21: చౌటుప్పల్లో 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ప్రయాణికులు నరకం చూశారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా.. మునుగోడు పర్యటన ముగించుకొని రోడ్డు మార్గం గుండా హైదరాబాద్కు బయలుదేరడంతో చౌటుప్పల్ తంగడపల్లి చౌరస్తా వద్ద హైవేపై బారికేడ్లను ఏర్పాటు చేశారు.
సుమారు గంటపాటు ట్రాఫిన్ను నిలిపివేశారు. దాంతో హైవేపై 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లి, హైదరాబాద్కు తిరిగివస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.