హైదరాబాద్: హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నేడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ విందు జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇతర ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. అందువ్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
ఈ జంక్షన్ల వైపు వెళ్లొద్దు..
మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు పోలీస్ కంట్రోల్ రూం, బషీర్బాగ్, బీజేఆర్ విగ్రహం సర్కిల్, ఎస్బీఐ గన్ఫౌండ్రీ, అబిడ్స్ సర్కిల్, ఏఆర్ పెట్రోల్ పంప్, నాంపల్లి, కేఎల్కే బిల్డింగ్, లిబర్టీ, రవీంద్ర భారతి, లక్డీకపూల్, ఇక్బాల్ మినార్, హిమాయత్నగర్, అసెంబ్లీ, ఎం.జే.మార్కెట్, హైదర్గూడ జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ జంక్షన్ల నుంచి రాకపోకలు సాగించకపోవడం మంచిదని అదనపు సీపీ తెలిపారు. ఇక ఆర్టీసీ బస్సులను రవీంద్రభారతి నుంచి అబిడ్స్ వైపు కాకుండా.. ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి నాంపల్లి స్టేషన్ రోడ్డు మీదుగా వెళ్లాలి. పార్కింగ్ స్థలాలను అందుబాటులో ఉంచామని, ఎవరికి కేటాయించిన స్థలాల్లో వారు వాహనాలను పార్క్ చేయాలని పోలీసులు సూచించారు.