చెల్లింపులకు వెబ్సైట్లో లింక్
75% నుంచి 90% తగ్గింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులకు శివరాత్రి రోజున పోలీసుశాఖ శుభవార్త అందించింది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఈ చలాన్లలో చెల్లింపులకు భారీ రాయితీ ప్రకటించింది. రెండు, మూడు చక్రాల వాహనాలకు 75%, ఆర్టీసీ డ్రైవర్లకు 70%, లైట్, హెవీ మోటారు వాహనాలకు 50%, తోపుడు బండ్లకు 75%, నో మాస్కు కేసులకు 90% రాయితీ ఇచ్చారు. ఈ చలాన్ల వెబ్సైట్ (https://echallan.tspolice. gov.in)లో ప్రత్యేక లింక్ మంగళవారం నుంచి అందుబాటులో రానున్నది. ఈ నెలాఖరు వరకు ఈ అవకాశం ఉంటుందని పోలీసువర్గాలు తెలిపాయి. ప్రజలు గత రెండేండ్లుగా కొవిడ్తో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని రాయితీ ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలతో పోలీ శాఖ న్యాయాధికారులను సంప్రదించిన ఈ-లోక్అదాలత్ ద్వారా ఉల్లంఘనలదారులకు వన్టైమ్ సెటిల్మెంట్ కింద భారీ రాయితీ ఇస్తున్నది.