హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇందులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నాదమ్ములు దుర్మరణం పాలయ్యారు. పిల్లలమర్రి వద్ద జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఇల్లెందు నుంచి జంగాలపల్లికి వెళ్తున్న సమయంలో ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బండిపై ఉన్న శ్రీనివాస్, భాను ప్రకాశ్ మృతి చెందారు. మృతులు జంగాలపల్లికి చెందిన అన్నదమ్ములుగా తెలుస్తున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.