మంచిర్యాల, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శ్రీరామచంద్రుడు ఏమన్నా బీజేపీ జాగీరా..? మీ పార్టీలో సభ్యత్వం ఉన్నదా..? ఉంటే చెప్పాలని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ బీజేపీ నాయకులను ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లాలో ఎంఎన్ఆర్ గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ బాడీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. మాయమాటలు చెప్పి మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. పన్నెండున్నర ఏండ్లలోప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. తీరా ఉన్న ఉద్యోగాలే పీకేసిందని విమర్శించారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీలను మూసేయడం.. లేకుంటే అమ్మడం తప్ప బీజేపీ చేసింది ఏమీ లేదని ఆరోపించారు. శ్రీరామచంద్రుడు, హనుమంతుడి పేర్ల జపం తప్ప ప్రజల కోసం పనిచేసే పాపానపోలేదని మండిపడ్డారు. పొద్దున లేచిందే మొదలు కులం, మతం, దేవుడు అని ప్రజల మధ్య చిచ్చుపెడతారని ఎవరికి లేడు దేవుడు అని చురకలంటిచారు. కాంగ్రెస్ పార్టీకి సున్తీ అయిందా..?