నిర్మల్ : మామడ మండలం వాస్తవాపూర్ వాటర్ ఫాల్స్ను చూసేందుకు వచ్చిన హైదరాబాద్ పర్యాటకులు వరద నీటిలో చిక్కుకున్నారు. శుక్రవారం ఉదయం వాటర్ ఫాల్స్ను తిలకించేందుకు మొత్తం 16 మంది పర్యాటకులు వాస్తవాపూర్ చేరుకున్నారు. వాటర్ ఫాల్స్ను చూసిన తర్వాత అక్కడున్న వాగు దాటేందుకు వారంతా ప్రయత్నించారు.
అయితే ఎగువ నుంచి వరద ఉధృతి తీవ్రంగా ఉండటంతో.. నీటి ప్రవాహం ఎక్కువైంది. దీంతో పర్యాటకులు వాగును దాటలేక అవతలి వైపే ఉండిపోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పర్యాటకులను సురక్షితంగా వాగును దాటించారు. దీంతో పోలీసులకు పర్యాటకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.