హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్ జిల్లాలో అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం, పర్యాటక కేంద్రం మన్యంకొండ వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద అతిపెద్ద, తొలి రోప్వేను నిర్మించనున్నట్టు పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ చెప్పారు. రోప్వే ఏర్పాటు వల్ల పర్యాటకరంగం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్లోని తన కార్యాలయంలో కలకత్తా, ముంబైకి చెందిన ప్రముఖ రోప్వే సర్వీస్ ప్రొవైడర్లతో మావేశమయ్యారు.
ఈ సందర్భంగా దేశంలో వివిధ రాష్ట్రాల పర్యాటక ప్రదేశాల్లో నిర్మించిన పలు రోప్ వే డిజైన్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. రోప్వే అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలని సూచించారు. సంస్కృతీ సంప్రదాయాలు, ఎకో టూరిజం కేంద్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు తెలంగాణ దేశంలోనే ఎంతో గుర్తింపు పొందిందని చెప్పారు. సీఎం కేసీఆర్ పర్యాటక అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ప్రపంచస్థాయిలో తెలంగాణ పర్యాటక రంగం అభివృద్ధి చెందేలా దేశ విదేశాల్లో ప్రచారం కల్పిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.