గుంటూరు : తన కూతురితో తరుచూ మాట్లాడుతున్న ఓ యువకుడి కాళ్లు, చేతులు ఆమె కుటుంబ సభ్యులు నరికేశారు. ఈ దారుణ ఘటన పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామంలో కొద్ది రోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత యువకుడు వెంకటేశ్ గుంటూరులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందాడు. అయితే ఆ యువతి కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.