మంథని, ఆగస్టు 22: భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అగ్ర నాయకుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్తోపాటు కట్టా రామచంద్రారెడ్డి సురక్షితంగా ఉన్నారని మావోయిస్టు పార్టీ దండకారణ్య ఉత్తర సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి మంగ్లీ ప్రకటించారు. ఈ మేరకు మంగ్లీ పేరిట మంగళవారం పత్రికా ప్రకటన విడుదలైంది. ఆగస్టు 19న తెలుగు, హిందీ దినపత్రికల్లో వచ్చిన కథనాలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు. తమ ఇద్దరు అగ్రనేతలు క్షేమంగా, సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నా రు. ఈ దుష్ప్రచారాన్ని ప్రజలు ఎవరు కూడా నమ్మొద్దని కోరారు.