చేర్యాల, మే 16 : సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేర్యాల మండలంలోని వీరన్నపేటకు చెందిన ఆరెళ్ల రవి(40) అనే గీత కార్మికుడు తాటి చెట్టు పై నుంచి పడి సోమవారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. రోజువారీ పనిలో భాగంగా.. తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు రవి కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్కుమార్, గౌడ సంఘం నాయకులు కోరారు. కాగా, ఎక్సైజ్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతునికి భార్య జ్యోతి, కుతూరు, కుమారుడు ఉన్నారు.