Assembly: ఇవాళ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ జరుగనుంది. చర్చ అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్పై చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. ఆ తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్పెండీచర్పై చర్చ చేపట్టి, సమాధానం ఇచ్చి, ఓటింగ్ నిర్వహించనున్నారు.
ఈ మేరకు రాష్ట్ర లెజిస్లేచర్ సెక్రెటరీ డాక్టర్ వీ నరసింహాచార్యులు మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా శాసన మండలిలో కూడా ఇవాళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ జరుగుతుందని, చర్చ అనంతరం ఆ చర్చకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమాధానం ఇస్తారని ఆయన మరో ప్రకటనలో తెలియజేశారు.