హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని గ్రేటర్ హైదరాబాద్ ఆటో యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు. దీనికితోడు ఓలా, ఊబర్తో ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సర్కార్ తమకు బతుకుదెరువు చూపాలని ఆయన డిమాండ్ చేశారు. అందులో భాగంగానే శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని శ్రమశక్తి భవన్లో బీఎంఎస్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.