హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): వినాయక నిమజ్జనం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్తోపాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం సెలవుదినంగా ప్రకటించింది. దీనికి బదులుగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళశాలలకు నవంబర్ 12 (రెండో శనివారం)ను పనిదినంగా పేర్కొన్నది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.