హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగులందరికీ కరువుభత్యం (డీఏ) మంజూరుచేయాలని టీఎన్జీవో నేతలు మంత్రి కేటీఆర్ను కోరారు. టీఎన్టీవో నేతలు శుక్రవారం ప్రగతిభవన్లో కేటీఆర్ను కలిసి పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు.
టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జీ దేవీప్రసాద్, ముజీబ్, శ్రీరామ్ తదితరులు ఉన్నారు.