హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): మంత్రి హరీశ్రావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చేస్తున్న వ్యాఖ్యలు హస్యాస్పదమని టీఎన్జీవో కేంద్ర సంఘం నాయకులు పేర్కొన్నారు. ఏపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ.. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, అసోసియేట్ అధ్యక్షుడు వెంకట్ కస్తూరి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర రాష్ర్టాల కంటే తెలంగాణలో మెరుగైన వేతనాలు ఉన్నాయని చెప్తున్న సందర్భంలో మంత్రి హరీశ్రావు ఏపీ పరిస్థితిని ఉదహరించడంపై రాద్ధాంతం చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఎనిమిదేండ్ల పే-రివిజన్ ద్వారా 73% ఫిట్మెంట్ సాధిస్తే.. ఏపీలో 66 శాతమే సాధించుకోవడం వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు. నూతన జోనల్ వ్యవస్థ ద్వారా స్థానికులకే 95% ఉద్యోగాలు దకేలా నోటిఫికేషన్లు ఇస్తూ.. ఉద్యోగులకు పని భారం తగ్గే విధంగా చర్యలు తీసుకొంటున్న తెలంగాణ ప్రభుత్వంతో ఉద్యోగుల సమస్యలను సమయానుకూలంగా పరిషరించుకొంటున్నామని తెలిపారు. ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటున్న హరీశ్రావుపై తప్పుడు ప్రచారాలు చేస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. టీజీవో అధ్యక్షురాలు మమత కూడా ఏపీ నేతల తీరుపై మండిపడ్డారు.