హైదరాబాద్, మార్చి 15: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) సన్మానించింది. మంగళవారం హైదరాబాద్లో పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ.. శ్రీనివాస్గౌడ్ అధ్యక్షతన తాను టీజీవో వైస్ ప్రెసిడెంట్గా పనిచేశానని, ఈ రోజు అదే సంఘం తనను సన్మానించటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజీవో అధ్యక్షురాలు మమత, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.