హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రభుత్వాన్ని కోరింది. పెండింగ్లో ఉన్న డీఏలను సైతం విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. సోమవారం టీఎన్జీవో నేతలు సచివాయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
రంగారెడ్డి కలెక్టరేట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 24 శాతం హెచ్ఆర్ఏను మంజూరు చేయాలని, సమస్యలనూ పరిష్కరించాలని కోరారు. తమ వినతులపై వారు సానుకూలంగా స్పందించినట్టు సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ తెలిపారు. టీఎన్జీవో అసొసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకట్, ముత్యాల సత్యనారాయణగౌడ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, బుచ్చిరెడ్డి, మాధవ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.