హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): దీపావళి సందర్భంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న మూడు పెండింగ్ డీఏలను విడుదల చేయడానికి అనుమతి ఇవ్వాలని టీఎన్జీవో కేంద్ర సంఘం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్కు విజ్ఞప్తిచేసింది.
టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, టీఎన్జీవో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకట్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మూజీబ్ హుస్సేనీ, కేంద్ర సంఘ ప్రతినిధి పర్వతాలు బుధవారం బీఆర్కే భవన్లో సీఈవో వికాస్రాజ్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు డీఏల కోసం ఎదురు చూస్తున్నారని, విన్నపంపై సానుకూలంగా స్పందించాలని కోరారు.