మహబూబ్నగర్ అర్బన్, జూలై 14 : వర్గీకరణ పేరుతో దేశంలోని ఎస్సీలను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తున్నదని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేపడుతామని ఓట్లు వేయించుకొని ఇప్పుడు మోసం చేస్తున్నదని విమర్శించారు.