యాదాద్రి, డిసెంబర్ 1 : యాదగిరీశుడికి తిరువీధి సేవోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గురువారం సాయంత్రం స్వామివారిని గరుడ వాహనం, అమ్మవారిని తిరుచ్చివాహనంపై సేవలను కొనసాగించారు. స్వయంభూ నారసింహుడికి నిత్యోత్సవాలను అర్చకులు తెల్లవారుజాము నుంచే ప్రారంభించారు.
దర్బార్ సేవలో భాగంగా ప్రధానాలయ ముఖమండపంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించారు. స్వా మి, అమ్మవార్లకు సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. సుమా రు 12 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. ఖజానాకు రూ. 18,37,699 సమకూరినట్టు ఆలయ ఈవో గీత తెలిపారు.