యాదాద్రి, నవంబర్ 15 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం వైభవంగా సాగింది. మంగళవారం సాయంత్రం ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించారు.
స్వామివారిని గరుడ వాహనసేవ, అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ప్రధానాలయ మాడ వీధుల్లో ఊరేగించారు. పశ్చిమ సప్తతల రాజగోపురం నుంచి తిరుమాడ వీధులు తిరుగుతూ తూర్పు పంచతల రాజగోపురం ద్వారా ప్రధానాలయంలోకి సేవ సాగింది. స్వామివారిని 25 వేల మంది దర్శించుకోగా, ఖజానాకు రూ. 34,73,509 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.