హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): తిరుమలేశుడిని గురువారం 75,776 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు వచ్చిందని వెల్లడించారు.
దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థిస్తూ 22 నుంచి 26 వరకు కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమాలను నిర్వహిస్తున్నట్టు టీటీడీ పేర్కొన్నది. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో 32 మంది వేద, శ్రౌత, స్మార్త పండితులు యాగ కార్యక్రమాల్లో పాల్గొంటారని వివరించారు.