హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్ర్తాలను శుక్రవారం టెండర్ కమ్ వేలం వేయనున్నారు. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్ర్తా లు 14 లాట్లు ఉన్నాయి.
ఇందులో కొత్త ఆర్ట్ సిల్క్ చీరలు, కొత్త ఆర్ట్ సిల్క్ ధోతీలు, అప్ప ర్స్, వాడిన, చిరిగిన ధోతీలు, కొత్త పాలిస్టర్, నైలాన్, నైలెక్స్ చీరలు, కొత్త లుంగీలు, క్లాత్ బిట్స్, ఆర్డినరీ టవల్స్, అప్పర్స్, పాలిస్టర్ అప్పర్స్, టర్కీ టవల్స్, రెడీమేడ్స్, హుండీ గలీబులు ఉన్నాయి. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్సైట్ www.tirumala. org లేదా www.konugolu.a.govt.in సంప్రదించాలని టీటీడీ అధికారులు సూచించారు.