హైదరాబాద్ : హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై టిప్పర్ మంగళవారం బీభత్సం సృష్టించింది. ఓ టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సుతో పాటు కారును ఢీకొట్టింది. ఆ తర్వాత పల్టీలు కొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుప్రతికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం వద్ద ఘటన చోటు చేసుకున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.