హైదరాబాద్, ఫిబ్రవరి21 (నమస్తే తెలంగాణ): వినియోగదారుల నుంచి వచ్చే విద్యుత్తు సమస్యలపై సకాలంలో స్పందించాలని డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు. కాల్సెంటర్ను బలోపేతం చేయాలని, వినియోగదారుల నుంచి వచ్చే ప్రతి కాల్ను రికార్డు చేసి, ఆ ఫిర్యాదులకు ఏ పరిషారం చూపారో ఎప్పటికప్పుడు తెలపాలని పేర్కొన్నారు.
వచ్చే వేసవిలో విద్యుత్తు సరఫరా ఏర్పాట్లపై సీఎండీ రిజ్వీతో కలిసి ట్రాన్స్కో ఎస్ఈలతో సచివాలయం నుంచి బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులు, వ్యాపారులు సహా వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్తును సంపూర్ణంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.
అసత్యాలు ప్రచారం చేసే వారిపై సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ఇబ్బందులను సీఎండీకి ఆ తర్వాత తనకు తెలపాలని ఆదేశించారు. సమావేశంలో దక్షిణ డిసం సీఎండీ ముషారఫ్ ఫారూఖీ, ఉత్తర డిసమ్ సీఎండీ వరుణ్రెడ్డి, ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.